యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై దోమ సుజిత్
న్యాల్కల్ మండలంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు బుధవారం చినేగేపల్లి, గణేశపూర్ గ్రామాల్లో ప్రత్యేక డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మత్తు రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి