Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:31 PM

తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు

తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు

తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు
26-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను మైనార్టీ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించగా యువత, మైనార్టీ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, సమానత్వం వంటి విలువలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి కంగ్టి పోలీస్ స్టేషన్ ఎస్సై దుర్గా రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మతపరమైన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, అన్ని వర్గాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ సోదరభావంతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఈ వేడుకలు గ్రామంలో మత సామరస్యం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.

Sthanikam

తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను మైనార్టీ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించగా యువత, మైనార్టీ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, సమానత్వం వంటి విలువలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి కంగ్టి పోలీస్ స్టేషన్ ఎస్సై దుర్గా రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మతపరమైన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, అన్ని వర్గాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ సోదరభావంతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఈ వేడుకలు గ్రామంలో మత సామరస్యం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News