విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఈఎల్ వి భాస్కర్
బహుజన వీరుడు, తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడిపల్లి సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తా వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలోని ఆయన విగ్రహానికి ఈ ఎల్ వి భాస్కర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ... అణచివేతపై తిరుగుబాట బావుటా ఎగురవేసి, సామాజిక న్యాయం, బహుజన రాజ్యస్థాపన కోసం పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన పోరాట పటిమ, ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకు శివకుమార్ గౌడ్, దేవేందర్ గౌడ్, అలె చిరంజీవి, బుడ్డా సురేష్, ఉపసర్పంచ్ వెంకటేష్, మార్గం శివ, ప్రవీణ్ గౌడ్, గౌడ కుల పెద్దలు, నియోజకవర్గ, మున్సిపల్ పరిధిలోని గౌడ కుల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి