భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 95-నకిరేకల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండల ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం తహసీల్దార్ విజయ్కుమార్ విడుదల చేశారు. మండలంలోని 55 పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు జాబితాలను ప్రచురించారు.
చిట్యాల మండలంలో మొత్తం 44,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 22,256 మంది పురుషులు, 22,513 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఓటర్లు తమ పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయో లేదో సంబంధిత పోలింగ్ కేంద్రం, బీఎల్ఓల వద్ద లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవాలనిసూచించారు.అర్హత కలిగిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6, పేరు తొలగింపునకు ఫారం-7, పేరు, చిరునామా, ఫొటో తదితర వివరాల్లో మార్పులకు ఫారం-8 సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత బీఎల్ఓలకు లేదా ఆన్లైన్ ద్వారా ఏఈఆర్ఓ, ఈఆర్ఓ అధికారులకు సమర్పించవచ్చని తహసీల్దార్ విజయ్కుమార్ పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి