Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లారీలో 360 లీటర్ల డీజిల్ చోరీ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 12:28 PM

55 పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా జాబితా.

55 పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా జాబితా.

55 పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా జాబితా.
18-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 95-నకిరేకల్‌ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండల ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ విడుదల చేశారు. మండలంలోని 55 పోలింగ్‌ కేంద్రాల్లో సంబంధిత బూత్‌ లెవెల్‌ అధికారులు జాబితాలను ప్రచురించారు.

చిట్యాల మండలంలో మొత్తం 44,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 22,256 మంది పురుషులు, 22,513 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఓటర్లు తమ పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయో లేదో సంబంధిత పోలింగ్‌ కేంద్రం, బీఎల్‌ఓల వద్ద లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలనిసూచించారు.అర్హత కలిగిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6, పేరు తొలగింపునకు ఫారం-7, పేరు, చిరునామా, ఫొటో తదితర వివరాల్లో మార్పులకు ఫారం-8 సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత బీఎల్‌ఓలకు లేదా ఆన్‌లైన్‌ ద్వారా ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓ అధికారులకు సమర్పించవచ్చని తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Sthanikam

55 పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా జాబితా.

Article Image

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 95-నకిరేకల్‌ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండల ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ విడుదల చేశారు. మండలంలోని 55 పోలింగ్‌ కేంద్రాల్లో సంబంధిత బూత్‌ లెవెల్‌ అధికారులు జాబితాలను ప్రచురించారు.

చిట్యాల మండలంలో మొత్తం 44,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 22,256 మంది పురుషులు, 22,513 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఓటర్లు తమ పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయో లేదో సంబంధిత పోలింగ్‌ కేంద్రం, బీఎల్‌ఓల వద్ద లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలనిసూచించారు.అర్హత కలిగిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6, పేరు తొలగింపునకు ఫారం-7, పేరు, చిరునామా, ఫొటో తదితర వివరాల్లో మార్పులకు ఫారం-8 సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత బీఎల్‌ఓలకు లేదా ఆన్‌లైన్‌ ద్వారా ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓ అధికారులకు సమర్పించవచ్చని తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News