గంజాయిపై యుద్ధం.. అవగాహనే ఆయుధం.
రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో గంజాయి, మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని ఎస్ ఐ సతీష్ సూచించారు. వెల్లంకి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నకరకంటి గణేష్ ఆధ్వర్యంలో సోమవారం మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ సతీష్ మాట్లాడుతూ గంజాయి, మద్యం, గుట్కా, సిగరెట్లు తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ ప్రజలు కూడా మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్. అశోక్,మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సత్తిరెడ్డి, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐటి పాముల పెద్దులు, వార్డు సభ్యులు గంజి భాస్కర్, గోధుమల సోమప్ప, ఎడ్ల సంజీవరెడ్డి, ఢిల్లీ ప్రమోదరెడ్డి, తాటిపాముల స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి