Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎరువులు వ్యవసాయ అధికారి గిరిబాబు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 03:36 PM

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎరువులు వ్యవసాయ అధికారి గిరిబాబు

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎరువులు వ్యవసాయ అధికారి గిరిబాబు

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎరువులు  వ్యవసాయ అధికారి గిరిబాబు
17-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఎరువులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ యాప్ అమల్లోకి రానున్న నేపథ్యంలో రైతులు ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. చిట్యాల మండలంలో మొత్తం 19,434 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 13,834 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఐడీ పొందినట్లు తెలిపారు. ఇంకా 5,600 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఫర్టిలైజర్ యూరియా యాప్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త యాప్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులకు ఎరువులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల చిట్యాల మండలంలోని రైతులందరూ, ముఖ్యంగా ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు, వెంటనే సమీపంలోని మీసేవ కేంద్రాలు లేదా రైతు వేదికల్లోని ఏఈఓలను సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎరువులు వ్యవసాయ అధికారి గిరిబాబు

Article Image

ఎరువులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ యాప్ అమల్లోకి రానున్న నేపథ్యంలో రైతులు ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. చిట్యాల మండలంలో మొత్తం 19,434 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 13,834 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఐడీ పొందినట్లు తెలిపారు. ఇంకా 5,600 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఫర్టిలైజర్ యూరియా యాప్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త యాప్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులకు ఎరువులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల చిట్యాల మండలంలోని రైతులందరూ, ముఖ్యంగా ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు, వెంటనే సమీపంలోని మీసేవ కేంద్రాలు లేదా రైతు వేదికల్లోని ఏఈఓలను సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News