తండ్రి జ్ఞాపకార్థం కుమారుడి ఉదారత.. కొనియాడిన ప్రముఖులు
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే సదుద్దేశంతో గుర్రం శ్రీధర్ స్మారకార్థం, ఆయన కుమారుడు గుర్రం వేణు సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఆదివారం ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.ఈ సందర్భంగా నిపుణులైన వైద్యులు హాజరై పలువురికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి నయం చేయవచ్చని వైద్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన కుటుంబంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో మంచి అవగాహన కల్పించింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్, చేనేత కార్మికుల సంఘం చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్, గ్రామ ప్రముఖులు కోడెం రాములు, గుర్రం రామచంద్రం, గుర్రం కృష్ణ, బుట్టి కృష్ణ, బత్తుల శంకర్, గుర్రం ప్రమోద్ కుమార్, నర్సింహ, వినోభా కుమార్, సత్యనారాయణ, విశ్వనాథం, గుర్రం శ్రీనివాస్, చప్పిడి సంజీవ రెడ్డి, బుట్టి బాలరాజు, పారా శ్యామ్, కతుల సాయి తదితరులు పాల్గొన్నారు. తండ్రి జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమం నిర్వహించిన గుర్రం వేణును పలువురు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి