కిలో భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించిన ఐదుగురు స్కేటర్లు
మౌంట్ లిట్రా జీ స్కూల్ విద్యార్థులు స్కేటింగ్ క్రీడలో తమ ప్రతిభను చాటుతూ పాఠశాలకు గొప్ప విజయాన్ని అందించారు. ‘కిలో భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 80 నిమిషాల నిరంతర స్కేటింగ్ మారథాన్ సవాలును విద్యార్థులు జశ్వంత్, గౌతమ్, అక్షర, అయానా రామ్, సాన్విత విజయవంతంగా పూర్తి చేశారు.ఎటువంటి విరామం (బ్రేక్) లేకుండా వరుసగా 80 నిమిషాల పాటు నిరంతరంగా స్కేటింగ్ చేసి, ఈ కష్టతరమైన రికార్డును నెలకొల్పడం విశేషం. విద్యార్థులు చూపిన అంకితభావం, పట్టుదల, అద్భుతమైన ప్రతిభపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దిన స్కేటింగ్ కోచ్ సైదులు అందించిన శిక్షణ, మార్గనిర్దేశాన్ని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులకు నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ, క్రీడల్లో రాణించేందుకు సహకరిస్తున్న పాఠశాల డైరెక్టర్లు జైపాల్, శ్రీకాంత్ లకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రికార్డు సాధించిన యువ విజేతలను పాఠశాల బృందం అభినందిస్తూ, భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి