చౌటుప్పల్ డివిజన్ పెయింటింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వలిగొండ మండలం సంగం గ్రామానికి చెందిన గంగాపురం రమేష్ ఎన్నికయ్యారు. పెయింటింగ్ వృత్తిలోని కార్మికుల సంక్షేమం, ఐక్యత, వృత్తి నైపుణ్యాభివృద్ధి ఎదురవుతున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు బాధ్యులు తెలిపారు. అధ్యక్షుడు గా గంగాపురం రమేష్, ఉపాధ్యక్షులు ఎండీ సలీం ఖాన్, ముత్యాల సతీష్,
ప్రధాన కార్యదర్శి మందూరి మహేష్, సహాయ కార్యదర్శి పిల్ల సాగర్, కోశాధికారి అంకూరి బాబు శంకర్, ఉప కోశాధికారి ఆరుట్ల గణేష్,
ప్రచార కార్యదర్శులు ఏచూరి అనిల్, ఎస్కే జావిద్ కార్యవర్గ సభ్యులు మల్లేష్, అంజి, కృష్ణ, వి. మల్లేష్, గౌరవ అధ్యక్షులు బండమీది ఎల్లయ్య, పిల్ల మల్లేష్, ఎర్ర శంకరయ్య, గౌరవ సలహాదారులు ఊదరి నరసింహ, మందూరి గాలయ్య లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గంగాపురం రమేష్ మాట్లాడుతూ... డివిజన్లోని పెయింటర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని తెలిపారు. వృత్తిపరమైన శిక్షణ, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. పెయింటర్ల ఐక్యతను చాటుతూ అసోసియేషన్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి