అమరావతి భవనాల ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం దూరం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో సీఎం చంద్రబాబు పాల్గొన్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు.
అమరావతి స్టీల్ బ్రిడ్జి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండి శుక్రవారం ఉదయం విశాఖపట్నం వెళ్లారు. పవన్ కళ్యాణ్ను కార్యక్రమాలకు ఆహ్వానించేందుకు మంత్రి నారాయణ గురువారం రాయబారానికి వెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన ప్రారంభోత్సవాలకు హాజరు కాలేదు. విశాఖపట్నంలో నిర్వహించిన ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. అమరావతిలో నిర్మించిన ఎమ్మెల్యేల క్వార్టర్ల విషయంలో భారీగా అంచనాలు పెంచి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటికే మూడు కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్న నేపథ్యంలో తాజాగా అమరావతి ప్రారంభోత్సవాలకు కూడా హాజరు కాకపోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన గైర్హాజరుకు అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి