నోయిడాలో కలకలం.. బీహార్లో నిందితుడి అరెస్ట్
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అస్సాంకు చెందిన 19 ఏళ్ల యువతి మెహక్ అహ్మద్ ఓ పీజీలో హత్యకు గురైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మెహక్ ఉద్యోగం కోసం నోయిడాకు వచ్చి కాల్ సెంటర్లో పనిచేస్తోంది. తన స్నేహితురాలు సంజనతో కలిసి పీజీలో నివసిస్తోంది. అదే భవనంలో ఉంటున్న రమన్ తన గదికి ఎదురుగా కూర్చొని మద్యం సేవించడంపై మెహక్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
మద్యం సేవించవద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రమన్ మెహక్పై దాడి చేసి, అనంతరం కత్తితో పలుమార్లు పొడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలతో మెహక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. హత్య అనంతరం మెహక్ మృతదేహాన్ని పీజీ గదిలోనే వదిలేసి రమన్ బీహార్కు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో నిందితుడి ఆచూకీ లభించడంతో బీహార్లో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి