Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 14, 2026 04:38 PM

అపోహలు వీడి.. అవయవదానానికి ముందుకు రావాలి. డాక్టర్ భూషణ్ రాజు.

అపోహలు వీడి.. అవయవదానానికి ముందుకు రావాలి. డాక్టర్ భూషణ్ రాజు.

అపోహలు వీడి.. అవయవదానానికి ముందుకు రావాలి.  డాక్టర్ భూషణ్ రాజు.
13-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అవయవదానం.. ఓ జీవితానికి పునర్జన్మ!


అపోహలు వీడి.. అవయవదానానికి ముందుకు రాజు.

హైదరాబాద్, ఆగస్టు 13 స్థానికం ప్రతినిధి:

అవయవదానం ద్వారా మరో వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించవచ్చని నిమ్స్ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్, అధిపతి, ఎస్‌వోటీటీవో (జీవన్‌దాన్) విభాగాధిపతి డాక్టర్ శ్రీ భూషణ్ రాజు అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘అవయవ దానం: అపోహలు–వాస్తవాలు’ అంశంపై ‘వార్త’ మీడియా కార్యశాల నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ భూషణ్ రాజు మాట్లాడుతూ.. వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా మానవ అవయవాలను పూర్తిగా కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాలేదన్నారు. అందువల్ల అవయవదాతలు, వారి కుటుంబాల ఉదారత ఎంతో విలువైనదని చెప్పారు. అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు దానం చేసిన అవయవం కొత్త జీవితాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.దేశంలో అవయవ మార్పిడికి భారీ డిమాండ్ ఉండగా.. అందుబాటులో ఉన్న అవయవాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ అంతరాన్ని తగ్గించాలంటే ప్రజల్లో అవయవదానంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలు, తప్పుడు ప్రచారాలను తొలగించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు.

దాత, గ్రహీతలకు వైద్యపరంగా సరిపోలని సందర్భాల్లో స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా అవయవ మార్పిడి చేసే అవకాశం ఉందని వివరించారు. కుటుంబాలు అవయవదానంపై ముందుగానే చర్చించుకోవాలని, స్వచ్ఛందంగా దానానికి అంగీకారం తెలియజేయాలని కోరారు.

పీఐబీ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. దేశంలో అవయవ మార్పిడికి ఉన్న డిమాండ్, అందుబాటులో ఉన్న అవయవాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందన్నారు. ఎన్‌వోటీటీవో, ఎస్‌వోటీటీవోలు అవయవదానం, మార్పిడి ప్రక్రియలో కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. మీడియా కార్యశాలల ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వాస్తవాలను చేరవేస్తున్నామని చెప్పారు.

కార్యశాలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని అవయవదానానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం పిలుపునిచ్చింది.

అవయవదానంపై సమాచారం, సహాయం కోసం 1800-11-477 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.

Sthanikam

అపోహలు వీడి.. అవయవదానానికి ముందుకు రావాలి. డాక్టర్ భూషణ్ రాజు.

Article Image

అవయవదానం.. ఓ జీవితానికి పునర్జన్మ!


అపోహలు వీడి.. అవయవదానానికి ముందుకు రాజు.

హైదరాబాద్, ఆగస్టు 13 స్థానికం ప్రతినిధి:

అవయవదానం ద్వారా మరో వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించవచ్చని నిమ్స్ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్, అధిపతి, ఎస్‌వోటీటీవో (జీవన్‌దాన్) విభాగాధిపతి డాక్టర్ శ్రీ భూషణ్ రాజు అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘అవయవ దానం: అపోహలు–వాస్తవాలు’ అంశంపై ‘వార్త’ మీడియా కార్యశాల నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ భూషణ్ రాజు మాట్లాడుతూ.. వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా మానవ అవయవాలను పూర్తిగా కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాలేదన్నారు. అందువల్ల అవయవదాతలు, వారి కుటుంబాల ఉదారత ఎంతో విలువైనదని చెప్పారు. అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు దానం చేసిన అవయవం కొత్త జీవితాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.దేశంలో అవయవ మార్పిడికి భారీ డిమాండ్ ఉండగా.. అందుబాటులో ఉన్న అవయవాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ అంతరాన్ని తగ్గించాలంటే ప్రజల్లో అవయవదానంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలు, తప్పుడు ప్రచారాలను తొలగించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు.

దాత, గ్రహీతలకు వైద్యపరంగా సరిపోలని సందర్భాల్లో స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా అవయవ మార్పిడి చేసే అవకాశం ఉందని వివరించారు. కుటుంబాలు అవయవదానంపై ముందుగానే చర్చించుకోవాలని, స్వచ్ఛందంగా దానానికి అంగీకారం తెలియజేయాలని కోరారు.

పీఐబీ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. దేశంలో అవయవ మార్పిడికి ఉన్న డిమాండ్, అందుబాటులో ఉన్న అవయవాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందన్నారు. ఎన్‌వోటీటీవో, ఎస్‌వోటీటీవోలు అవయవదానం, మార్పిడి ప్రక్రియలో కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. మీడియా కార్యశాలల ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వాస్తవాలను చేరవేస్తున్నామని చెప్పారు.

కార్యశాలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని అవయవదానానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం పిలుపునిచ్చింది.

అవయవదానంపై సమాచారం, సహాయం కోసం 1800-11-477 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News