Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో డయల్‌–112 అత్యవసర సేవలు ప్రారంభం బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 05:54 PM

జనన–మరణ ధృవీకరణ పత్రాల జారీలో కొత్త నిబంధనలు

జనన–మరణ ధృవీకరణ పత్రాల జారీలో కొత్త నిబంధనలు

జనన–మరణ ధృవీకరణ పత్రాల జారీలో కొత్త నిబంధనలు
05-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రెండేళ్లు దాటిన నమోదులకు కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి

పారదర్శకత, నకిలీ ధ్రువపత్రాల నివారణే లక్ష్యం

జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదులో పారదర్శకత పెంచడం, నకిలీ ధ్రువపత్రాల జారీని అరికట్టడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం జననం లేదా మరణం జరిగిన తేదీ నుంచి రెండేళ్లు దాటిన తర్వాత నమోదు చేయాలంటే ఇకపై జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి కానున్నాయి.

అధికారుల వివరాల ప్రకారం, రెండేళ్లు దాటిన నమోదుల కోసం దరఖాస్తుదారు అఫిడవిట్‌తో పాటు అవసరమైన ఆధారాలను కోర్టులో సమర్పించాలి. విచారణ అనంతరం జేఎంఎఫ్‌సీ జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగానే సంబంధిత జనన–మరణ నమోదు అధికారి డిజిటల్ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.

కొత్త నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)-2023కు అనుగుణంగా అమలు కానున్నాయి.

ఆలస్యమైన నమోదులకు నిబంధనలు

21 రోజుల లోపు: ఎలాంటి రుసుము లేకుండా నమోదు.

21 నుంచి 30 రోజుల లోపు: నిర్ణీత ఆలస్య రుసుముతో నమోదు.

30 రోజుల నుంచి ఏడాది లోపు: ఆలస్య రుసుముతో పాటు సంబంధిత అధికారుల అనుమతితో నమోదు.

ఒకటి నుంచి రెండేళ్ల లోపు: సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతితో నమోదు.

రెండేళ్లు దాటితే: జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి.

జనన ధ్రువీకరణ పత్రం పాఠశాల ప్రవేశాలు, ఆధార్, పాస్‌పోర్టు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వారసత్వ హక్కులు వంటి అనేక అవసరాలకు కీలకమైన పత్రం కాగా, మరణ ధ్రువీకరణ పత్రం బీమా, పెన్షన్, ఆస్తి, చట్టపరమైన వ్యవహారాలకు అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు.

జననం లేదా మరణం జరిగిన వెంటనే గ్రామ పంచాయతీ, గ్రామ/వార్డు సచివాలయం, మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థలో నిర్ణీత గడువులో నమోదు చేయించి ధ్రువీకరణ పత్రం పొందాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Sthanikam

జనన–మరణ ధృవీకరణ పత్రాల జారీలో కొత్త నిబంధనలు

Article Image

రెండేళ్లు దాటిన నమోదులకు కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి

పారదర్శకత, నకిలీ ధ్రువపత్రాల నివారణే లక్ష్యం

జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదులో పారదర్శకత పెంచడం, నకిలీ ధ్రువపత్రాల జారీని అరికట్టడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం జననం లేదా మరణం జరిగిన తేదీ నుంచి రెండేళ్లు దాటిన తర్వాత నమోదు చేయాలంటే ఇకపై జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి కానున్నాయి.

అధికారుల వివరాల ప్రకారం, రెండేళ్లు దాటిన నమోదుల కోసం దరఖాస్తుదారు అఫిడవిట్‌తో పాటు అవసరమైన ఆధారాలను కోర్టులో సమర్పించాలి. విచారణ అనంతరం జేఎంఎఫ్‌సీ జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగానే సంబంధిత జనన–మరణ నమోదు అధికారి డిజిటల్ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.

కొత్త నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)-2023కు అనుగుణంగా అమలు కానున్నాయి.

ఆలస్యమైన నమోదులకు నిబంధనలు

21 రోజుల లోపు: ఎలాంటి రుసుము లేకుండా నమోదు.

21 నుంచి 30 రోజుల లోపు: నిర్ణీత ఆలస్య రుసుముతో నమోదు.

30 రోజుల నుంచి ఏడాది లోపు: ఆలస్య రుసుముతో పాటు సంబంధిత అధికారుల అనుమతితో నమోదు.

ఒకటి నుంచి రెండేళ్ల లోపు: సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతితో నమోదు.

రెండేళ్లు దాటితే: జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి.

జనన ధ్రువీకరణ పత్రం పాఠశాల ప్రవేశాలు, ఆధార్, పాస్‌పోర్టు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వారసత్వ హక్కులు వంటి అనేక అవసరాలకు కీలకమైన పత్రం కాగా, మరణ ధ్రువీకరణ పత్రం బీమా, పెన్షన్, ఆస్తి, చట్టపరమైన వ్యవహారాలకు అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు.

జననం లేదా మరణం జరిగిన వెంటనే గ్రామ పంచాయతీ, గ్రామ/వార్డు సచివాలయం, మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థలో నిర్ణీత గడువులో నమోదు చేయించి ధ్రువీకరణ పత్రం పొందాలని అధికారులు ప్రజలకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News