Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రథయాత్ర విజయవంతానికి సహకరించిన వారికి అభినందనలు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 07:28 PM

ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం

ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం

ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం
July 26, 2026 05:13 PM 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శిశిర హాస్పిటల్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ & టెస్టింగ్ సెంటర్‌ను మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధు మాధవనేని మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నివారణకు సంబంధించిన సూచనలు అందించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సేవలు కొనసాగాయి. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు, కేంద్రానికి అవసరమైన వంటశాల, గోదాం నిర్మాణాన్ని ఎంపీ నిధులతో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైద్యుల విధుల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరు సంగమేశ్వర్, పట్టణ మాజీ అధ్యక్షుడు కే. శ్రీనివాస్, మండల అధ్యక్షురాలు ఓదెల రాజేశ్వరి, కర్ణ ఆదిత్య, ఉషన్న, శ్రీశైలం, కావలి అనిత, నామ హరీష్, ఉక్కిస భరత్, గొర్లిల్ల శివలింగం, తోట చంద్రశేఖర్, శ్రీకాంత్ రాజ్, శ్రీశైలం యాదవ్, గణపురం చంద్రశేఖర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News