ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం
ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం
Krishna
సదాశివపేట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శిశిర హాస్పిటల్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ & టెస్టింగ్ సెంటర్ను మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధు మాధవనేని మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నివారణకు సంబంధించిన సూచనలు అందించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సేవలు కొనసాగాయి. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు, కేంద్రానికి అవసరమైన వంటశాల, గోదాం నిర్మాణాన్ని ఎంపీ నిధులతో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైద్యుల విధుల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరు సంగమేశ్వర్, పట్టణ మాజీ అధ్యక్షుడు కే. శ్రీనివాస్, మండల అధ్యక్షురాలు ఓదెల రాజేశ్వరి, కర్ణ ఆదిత్య, ఉషన్న, శ్రీశైలం, కావలి అనిత, నామ హరీష్, ఉక్కిస భరత్, గొర్లిల్ల శివలింగం, తోట చంద్రశేఖర్, శ్రీకాంత్ రాజ్, శ్రీశైలం యాదవ్, గణపురం చంద్రశేఖర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి