ముంబయి, ఆగస్టు 5: భారత సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో నటించిన ప్రదీప్ సింగ్ రావత్ తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్యంగా తెలుగులో 'సై', 'ఛత్రపతి', 'గజిని' చిత్రాల్లో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు సినీ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచాయి.
హిందీ టెలివిజన్లో ప్రసారమైన 'మహాభారత్' సీరియల్లో అశ్వత్థామ పాత్ర ద్వారా కూడా ఆయన విశేష గుర్తింపు పొందారు. విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
ప్రదీప్ సింగ్ రావత్ మృతితో భారత సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయిందని సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి