Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో డయల్‌–112 అత్యవసర సేవలు ప్రారంభం బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 06:03 PM

విలన్ పాత్రలకు ప్రాణం పోసిన ప్రదీప్ సింగ్ రావత్ ఇకలేరు

విలన్ పాత్రలకు ప్రాణం పోసిన ప్రదీప్ సింగ్ రావత్ ఇకలేరు

విలన్ పాత్రలకు ప్రాణం పోసిన ప్రదీప్ సింగ్ రావత్ ఇకలేరు
05-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ముంబయి, ఆగస్టు 5: భారత సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో నటించిన ప్రదీప్ సింగ్ రావత్ తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్యంగా తెలుగులో 'సై', 'ఛత్రపతి', 'గజిని' చిత్రాల్లో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు సినీ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచాయి.

హిందీ టెలివిజన్‌లో ప్రసారమైన 'మహాభారత్' సీరియల్‌లో అశ్వత్థామ పాత్ర ద్వారా కూడా ఆయన విశేష గుర్తింపు పొందారు. విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

ప్రదీప్ సింగ్ రావత్ మృతితో భారత సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయిందని సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

విలన్ పాత్రలకు ప్రాణం పోసిన ప్రదీప్ సింగ్ రావత్ ఇకలేరు

Article Image

ముంబయి, ఆగస్టు 5: భారత సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో నటించిన ప్రదీప్ సింగ్ రావత్ తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్యంగా తెలుగులో 'సై', 'ఛత్రపతి', 'గజిని' చిత్రాల్లో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు సినీ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచాయి.

హిందీ టెలివిజన్‌లో ప్రసారమైన 'మహాభారత్' సీరియల్‌లో అశ్వత్థామ పాత్ర ద్వారా కూడా ఆయన విశేష గుర్తింపు పొందారు. విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

ప్రదీప్ సింగ్ రావత్ మృతితో భారత సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయిందని సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News