Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:40 AM

ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు

ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు

ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు
11-07-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లాలోని రైతు సోదరులకు ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని రకాల ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా యంత్రాంగం రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం జిల్లాలో రైతులకు పంపిణీ చేయడానికి 19,602 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.యూరియ 9,308 మెట్రిక్ టన్నులు

డిఏపి (DAP)2,481 మెట్రిక్ టన్నులు

ఎంఓపి (MOP) 795 మెట్రిక్ టన్నులు

కాంప్లెక్స్ ఎరువులు 5,612 మెట్రిక్ టన్నులు.

పంట విస్తీర్ణం ఆధారంగా, సరైన రైతుకు సరైన సమయంలో ఎరువులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం APAIMS 2.0 అనే నూతన పద్ధతి ద్వారా యూరియా మరియు DAP ఎరువులను పంపిణీ చేస్తోంది.ఈ విధానం వల్ల ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత ఉంటుంది. బ్లాక్ మార్కెటింగ్ మరియు ఇతర అవసరాలకు ఎరువులను మళ్లించడాన్ని పూర్తిగా నివారించవచ్చు.ఈ పద్ధతి ద్వారా జిల్లాలో ఇప్పటికే 20,070 మంది రైతులు 52,295 యూరియా బ్యాగులను, 18,582 డిఏపి బ్యాగులను కొనుగోలు చేశారు.ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్ నినో పరిస్థితుల కారణంగా వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల ప్రకారం కలెక్టర్ గారు రైతులకు కీలక సూచన చేశారు.రైతులు బెట్టను తట్టుకొని, తక్కువ కాలంలో చేతికి వచ్చే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కోరారు.కంది, ఆముదము,జొన్న, సజ్జ, కొర్ర, అలసంద

జిల్లాలో ఎరువుల పంపిణీపై గానీ, ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులపై గానీ ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే సంప్రదించడానికి పుట్టపర్తిలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

హెల్ప్‌లైన్ నెంబర్: 8331057715

జిల్లాలోని రైతు సోదరులందరూ ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను మరియు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. శాంప్రసాద్ కోరారు.

Sthanikam

ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లాలోని రైతు సోదరులకు ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని రకాల ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా యంత్రాంగం రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం జిల్లాలో రైతులకు పంపిణీ చేయడానికి 19,602 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.యూరియ 9,308 మెట్రిక్ టన్నులు

డిఏపి (DAP)2,481 మెట్రిక్ టన్నులు

ఎంఓపి (MOP) 795 మెట్రిక్ టన్నులు

కాంప్లెక్స్ ఎరువులు 5,612 మెట్రిక్ టన్నులు.

పంట విస్తీర్ణం ఆధారంగా, సరైన రైతుకు సరైన సమయంలో ఎరువులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం APAIMS 2.0 అనే నూతన పద్ధతి ద్వారా యూరియా మరియు DAP ఎరువులను పంపిణీ చేస్తోంది.ఈ విధానం వల్ల ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత ఉంటుంది. బ్లాక్ మార్కెటింగ్ మరియు ఇతర అవసరాలకు ఎరువులను మళ్లించడాన్ని పూర్తిగా నివారించవచ్చు.ఈ పద్ధతి ద్వారా జిల్లాలో ఇప్పటికే 20,070 మంది రైతులు 52,295 యూరియా బ్యాగులను, 18,582 డిఏపి బ్యాగులను కొనుగోలు చేశారు.ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్ నినో పరిస్థితుల కారణంగా వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల ప్రకారం కలెక్టర్ గారు రైతులకు కీలక సూచన చేశారు.రైతులు బెట్టను తట్టుకొని, తక్కువ కాలంలో చేతికి వచ్చే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కోరారు.కంది, ఆముదము,జొన్న, సజ్జ, కొర్ర, అలసంద

జిల్లాలో ఎరువుల పంపిణీపై గానీ, ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులపై గానీ ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే సంప్రదించడానికి పుట్టపర్తిలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

హెల్ప్‌లైన్ నెంబర్: 8331057715

జిల్లాలోని రైతు సోదరులందరూ ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను మరియు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. శాంప్రసాద్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News