యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు
Anjali
యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం–2026 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం సామూహిక యోగ కార్యక్రమం నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో కదిరి ఎం ఎల్ ఏ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా అధికారులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ లతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 7 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో యోగాంధ్ర–2026 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 7న లేపాక్షి లో యోగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం గ్రామ స్థాయిలో వివిధ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.జిల్లాలో యోగా గురువులను గుర్తించి, వారి ద్వారా మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి శిక్షణ అందించినట్లు తెలిపారు. అనంతరం ప్రతి సచివాలయానికి యోగా శిక్షకులను గుర్తించి, యోగా ట్రైనర్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వారికి శిక్షణ కొనసాగుతోందన్నారు.
ప్రతి సచివాలయంలో యోగా ట్రైనర్లును గుర్తించి గ్రామ స్థాయిలో యోగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా పోటీలు, యోగా క్విజ్లు, ప్రాణాయామం, వ్యక్తిగత యోగా ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజలందరూ రెండు మూడు వారాల కార్యక్రమంగా కాకుండా జీవితాంతం యోగాను అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం లో ఇన్చార్జ్ మున్సిపల్ కమీషనర్ సందీప్ ,ఆర్డీఓ కలావతి,తహసీల్దార్ రెడ్డి శేఖర్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి