* మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. కామినేని ఆసుపత్రికి తరలింపు
చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ప్లాజా సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం మైనవారిగూడెనికి చెందిన మైనం నాగమణి (51) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులు కారులో హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన సూర్యాపేట డిపో ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగమణిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన సీతారామచంద్రయ్య, రామంజమ్మలను నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మైన అశోక్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ ఎండి అస్లాంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి