మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ
మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ
Krishna
వట్టిపల్లి మండలం పరిధిలో మేడికుంద గ్రామంలో శనివారం సర్పంచ్ శ్రీమతి చంద్రకళ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి హన్మంత్ రెడ్డి గ్రామ అభివృద్ధి నివేదికను చదివి వినిపించగా, గ్రామ కార్యదర్శి చరణ్ రాజ్ ఎజెండా అంశాలపై చర్చ నిర్వహించారు. గ్రామ నర్సరీ నిర్వహణ, మురికికాలువల పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, బడిబాట కార్యక్రమం, ప్రీ-ప్రైమరీ విద్య, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, వృద్ధాప్య పింఛన్ల ఫోటో క్యాప్చర్ తదితర అంశాలపై గ్రామస్థులతో విస్తృతంగా చర్చించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు స్వీకరించారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని సభలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఎం.పీ.టి.సి శంకరప్ప, హెచ్ఎం సాయికృష్ణ, ఎఫ్ఏ సంగమేశ్వర్, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి