Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి – మాణిక్ రావు పటేల్‌కు శుభాకాంక్షలు ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 04:29 PM

మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ

మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ

మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ
June 06, 2026 03:24 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వట్టిపల్లి మండలం పరిధిలో మేడికుంద గ్రామంలో శనివారం సర్పంచ్ శ్రీమతి చంద్రకళ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి హన్మంత్ రెడ్డి గ్రామ అభివృద్ధి నివేదికను చదివి వినిపించగా, గ్రామ కార్యదర్శి చరణ్ రాజ్ ఎజెండా అంశాలపై చర్చ నిర్వహించారు. గ్రామ నర్సరీ నిర్వహణ, మురికికాలువల పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, బడిబాట కార్యక్రమం, ప్రీ-ప్రైమరీ విద్య, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, వృద్ధాప్య పింఛన్ల ఫోటో క్యాప్చర్ తదితర అంశాలపై గ్రామస్థులతో విస్తృతంగా చర్చించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు స్వీకరించారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని సభలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఎం.పీ.టి.సి శంకరప్ప, హెచ్‌ఎం సాయికృష్ణ, ఎఫ్‌ఏ సంగమేశ్వర్, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News