మహిళలు, బాలికల భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు రామన్నపేట పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఐ మొలుగురి రవి పర్యవేక్షణలో, ఎస్ ఐ గోపాతి సతీష్ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, బాలల భద్రత, అత్యవసర సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మొలుగురి రవి మాట్లాడుతూ మహిళలు, బాలికలపై జరిగే నేరాల నివారణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎలాంటి వేధింపులు, అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్–112, షీ టీమ్స్, మహిళా హెల్ప్లైన్–181, చైల్డ్ హెల్ప్లైన్–1098 సేవలను వినియోగించాలని సూచించారు.
ఎస్సై గోపాతి సతీష్ మాట్లాడుతూ చిన్నారులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై తల్లిదండ్రులు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన అన్నారు.
మహిళల గౌరవం, బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, సమాజంలో భద్రతాయుత వాతావరణం ఏర్పడేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని రామన్నపేట పోలీసులు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి