Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 10:44 PM

స్విమ్మింగ్ పూల్ నిర్వాహకునికి భారీ జరిమానా

స్విమ్మింగ్ పూల్ నిర్వాహకునికి భారీ జరిమానా

స్విమ్మింగ్ పూల్ నిర్వాహకునికి భారీ జరిమానా
05-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శివగంగా స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఒక యువకుడు మృతి చెందిన ఘటనలో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం ఏభై రెండు లక్షల పదకొండు వేల రూపాయలు పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది. ​చిట్యాల మండలం వట్టిమర్రి గ్రామానికి చెందిన నూనే శ్రవణ్‌కుమార్, 2024 ఏప్రిల్ 15న తన స్నేహితులతో కలసి చిట్యాల శివారులో ఉన్న శివగంగా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో శ్రవణ్‌కుమార్‌కు తలకు తీవ్ర గాయమై నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతడిని బయటకు తీసి నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ​ఈ దుర్ఘటనపై మృతుడి తండ్రి నూనే సంజీవ చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు ఎటువంటి భద్రతా చర్యలు పాటించలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విచారణలో తేలింది. ​బాధిత కుటుంబం న్యాయం కోసం నల్గొండ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. న్యాయవాదులు శేపూరి మధుసూదన్, ఎస్. పూర్ణచందర్‌లు బాధిత కుటుంబం తరఫున రూ. 50,00,000/- పరిహారం ఇప్పించాలని వాదనలు వినిపించారు.

​ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం చైర్‌పర్సన్ శ్రీ మామిడి క్రిస్టోఫర్, సభ్యులు సంధ్యారాణి, వెంకటేశ్వర్లు.. స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారంగా రూ. 52,11,000/- లను 45 రోజులలోపు చెల్లించాలని స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.

Sthanikam

స్విమ్మింగ్ పూల్ నిర్వాహకునికి భారీ జరిమానా

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శివగంగా స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఒక యువకుడు మృతి చెందిన ఘటనలో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం ఏభై రెండు లక్షల పదకొండు వేల రూపాయలు పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది. ​చిట్యాల మండలం వట్టిమర్రి గ్రామానికి చెందిన నూనే శ్రవణ్‌కుమార్, 2024 ఏప్రిల్ 15న తన స్నేహితులతో కలసి చిట్యాల శివారులో ఉన్న శివగంగా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో శ్రవణ్‌కుమార్‌కు తలకు తీవ్ర గాయమై నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతడిని బయటకు తీసి నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ​ఈ దుర్ఘటనపై మృతుడి తండ్రి నూనే సంజీవ చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు ఎటువంటి భద్రతా చర్యలు పాటించలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విచారణలో తేలింది. ​బాధిత కుటుంబం న్యాయం కోసం నల్గొండ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. న్యాయవాదులు శేపూరి మధుసూదన్, ఎస్. పూర్ణచందర్‌లు బాధిత కుటుంబం తరఫున రూ. 50,00,000/- పరిహారం ఇప్పించాలని వాదనలు వినిపించారు.

​ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం చైర్‌పర్సన్ శ్రీ మామిడి క్రిస్టోఫర్, సభ్యులు సంధ్యారాణి, వెంకటేశ్వర్లు.. స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారంగా రూ. 52,11,000/- లను 45 రోజులలోపు చెల్లించాలని స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News