Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 10:40 PM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్ సీఐ వెంకటేష్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్ సీఐ వెంకటేష్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్ సీఐ వెంకటేష్
05-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వలిగొండ, చౌటుప్పల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సులు

పాఠశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్లకు పోలీసుల సూచనలు

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజ స్థాపనకు సహకరించాలని చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం వలిగొండ ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలకు అలాగే చౌటుప్పల్‌లోని కృష్ణవేణి పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అతివేగం ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు వాడకూడదని హెచ్చరించారు.

​పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని, తమ కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రత సందేశాన్ని చేరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్ సీఐ వెంకటేష్

Article Image

వలిగొండ, చౌటుప్పల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సులు

పాఠశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్లకు పోలీసుల సూచనలు

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజ స్థాపనకు సహకరించాలని చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం వలిగొండ ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలకు అలాగే చౌటుప్పల్‌లోని కృష్ణవేణి పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అతివేగం ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు వాడకూడదని హెచ్చరించారు.

​పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని, తమ కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రత సందేశాన్ని చేరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News