వలిగొండ, చౌటుప్పల్లో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సులు
పాఠశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్లకు పోలీసుల సూచనలు
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజ స్థాపనకు సహకరించాలని చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం వలిగొండ ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలకు అలాగే చౌటుప్పల్లోని కృష్ణవేణి పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అతివేగం ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు వాడకూడదని హెచ్చరించారు.
పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని, తమ కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రత సందేశాన్ని చేరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి