Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 10:30 PM

వ్యాపార, పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండండి..! చైతన్యపురి పోలీసుల సైబర్ జాగ్రూకత దివస్.. మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు, వృద్ధులకు అవగాహన

వ్యాపార, పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండండి..! చైతన్యపురి పోలీసుల సైబర్ జాగ్రూకత దివస్.. మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు, వృద్ధులకు అవగాహన

వ్యాపార, పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండండి..! చైతన్యపురి పోలీసుల సైబర్ జాగ్రూకత దివస్.. మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు, వృద్ధులకు అవగాహన
05-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సైబర్ నేరాలు, ముఖ్యంగా వ్యాపార, పెట్టుబడి మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు చైతన్యపురి పోలీసులు బుధవారం విస్తృత స్థాయిలో సైబర్ జాగ్రూకత దివస్ కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో టెలిఫోన్ కాలనీ పార్క్, కోఠాపేటలోని నానో కళాశాల, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' ప్రతిజ్ఞ..

సైబర్ పోస్టర్ల ఆవిష్కరణ.

కార్యక్రమంలో భాగంగా సైబర్ అవగాహన పోస్టర్లను ప్రదర్శించి, పాల్గొన్న వారితో "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" ప్రతిజ్ఞ చేయించారు. వ్యాపార, పెట్టుబడి మోసాలకు సంబంధించిన అవగాహన చిత్రాన్ని ప్రదర్శిస్తూ నేరస్థులు అనుసరిస్తున్న కొత్త తరహా మోసాలపై వివరించారు.

మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి.

అధిక లాభాలు వస్తాయనే పేరుతో వచ్చే పెట్టుబడి ఆఫర్లు, అపరిచిత లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు ఫోన్ చేసి, cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని చైతన్యపురి పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Sthanikam

వ్యాపార, పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండండి..! చైతన్యపురి పోలీసుల సైబర్ జాగ్రూకత దివస్.. మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు, వృద్ధులకు అవగాహన

Article Image

సైబర్ నేరాలు, ముఖ్యంగా వ్యాపార, పెట్టుబడి మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు చైతన్యపురి పోలీసులు బుధవారం విస్తృత స్థాయిలో సైబర్ జాగ్రూకత దివస్ కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో టెలిఫోన్ కాలనీ పార్క్, కోఠాపేటలోని నానో కళాశాల, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' ప్రతిజ్ఞ..

సైబర్ పోస్టర్ల ఆవిష్కరణ.

కార్యక్రమంలో భాగంగా సైబర్ అవగాహన పోస్టర్లను ప్రదర్శించి, పాల్గొన్న వారితో "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" ప్రతిజ్ఞ చేయించారు. వ్యాపార, పెట్టుబడి మోసాలకు సంబంధించిన అవగాహన చిత్రాన్ని ప్రదర్శిస్తూ నేరస్థులు అనుసరిస్తున్న కొత్త తరహా మోసాలపై వివరించారు.

మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి.

అధిక లాభాలు వస్తాయనే పేరుతో వచ్చే పెట్టుబడి ఆఫర్లు, అపరిచిత లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు ఫోన్ చేసి, cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని చైతన్యపురి పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News