సైబర్ నేరాలు, ముఖ్యంగా వ్యాపార, పెట్టుబడి మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు చైతన్యపురి పోలీసులు బుధవారం విస్తృత స్థాయిలో సైబర్ జాగ్రూకత దివస్ కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టెలిఫోన్ కాలనీ పార్క్, కోఠాపేటలోని నానో కళాశాల, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' ప్రతిజ్ఞ..
సైబర్ పోస్టర్ల ఆవిష్కరణ.
కార్యక్రమంలో భాగంగా సైబర్ అవగాహన పోస్టర్లను ప్రదర్శించి, పాల్గొన్న వారితో "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" ప్రతిజ్ఞ చేయించారు. వ్యాపార, పెట్టుబడి మోసాలకు సంబంధించిన అవగాహన చిత్రాన్ని ప్రదర్శిస్తూ నేరస్థులు అనుసరిస్తున్న కొత్త తరహా మోసాలపై వివరించారు.
మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి.
అధిక లాభాలు వస్తాయనే పేరుతో వచ్చే పెట్టుబడి ఆఫర్లు, అపరిచిత లింకులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫోన్ చేసి, cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని చైతన్యపురి పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి