Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 10:29 PM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ.
05-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓటీపీ, బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచాలి..


సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి

సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ సూచించారు. సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ మాట్లాడుతూ.. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి గోప్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లతో పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సకాలంలో ఫిర్యాదు చేస్తే నష్టాన్ని నివారించే అవకాశం

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు ఫోన్ చేయడంతో పాటు cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సీఐ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలతో పాటు బాధితులకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. ఉదయ్ కిరణ్, అధ్యాపకులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు సైబర్ నేరాల నివారణ, వ్యక్తిగత సమాచార భద్రత, ఆన్‌లైన్ మోసాల గుర్తింపు వంటి అంశాలపై అవగాహన పొందారు.

Sthanikam

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ.

Article Image

ఓటీపీ, బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచాలి..


సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి

సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ సూచించారు. సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ మాట్లాడుతూ.. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి గోప్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లతో పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సకాలంలో ఫిర్యాదు చేస్తే నష్టాన్ని నివారించే అవకాశం

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు ఫోన్ చేయడంతో పాటు cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సీఐ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలతో పాటు బాధితులకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. ఉదయ్ కిరణ్, అధ్యాపకులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు సైబర్ నేరాల నివారణ, వ్యక్తిగత సమాచార భద్రత, ఆన్‌లైన్ మోసాల గుర్తింపు వంటి అంశాలపై అవగాహన పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News