నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బుధవారం జరిగిన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరు నడుమ నూతి వెంకటేశం ప్యానల్ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో ఈ ప్యానల్కు చెందిన 9 మంది డైరెక్టర్లు గెలుపొందారు. గెలుపొందిన వారిలో నూతి వెంకటేశం,గుండెబోయిన నరసింహ, గుండెబోయిన రాజు, గుండెబోయిన మహేష్, దేశగొని గణేష్, భైరవోని పెద్ద స్వామి, నూతి గణేష్, నాశబోయిన శకుంతల
బుంగపట్ల వెంకమ్మ ఉన్నారు. మద్దతు తెలిపిన ముదిరాజ్ కుటుంబ సభ్యులకు గెలుపొందిన ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, సర్పంచ్ కాటం వెంకటేశం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేస్తామని, సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ అధ్యక్షుడు బుంగపట్ల తిమ్మయ్యతో పాటు నాశబోయిన యాదయ్య, బుంగపట్ల సత్తయ్య, భైరవుని బిక్షం, గుండెబోయిన చంద్రయ్య, గుండెబోయిన సాలయ్య, గుండెబోయిన స్వామి, దేశగాని మహాలింగం, నూతి యాదయ్య, నూతి నరసింహ, గుండ్ల నరసింహ, చిలుముల చంద్రయ్య, గుండెబోయిన నడిపి నరసింహ మరియు ముదిరాజ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి