తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని చిట్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం ఐసీడీఎస్ సీడీపీఓ లావణ్య ఆధ్వర్యంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, అవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, కనీసం రెండేళ్ల వరకు కొనసాగించాలని బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 6 నెలల చిన్నారులకు అన్నప్రాశన చేయించడంతో పాటు, ఐసీడీఎస్ అందించిన అంగన్వాడీ విద్యార్థుల యూనిఫాంలను వైస్ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ షబానా, కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, 4వ వార్డు ప్రతినిధి కోనేటి ఎల్లయ్య, అంగన్వాడీ టీచర్లు దాడి అరుణ, జ్యోతి, అపర్ణ, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, కోనేటి మమత, వరమ్మలతో పాటు పలువురు తల్లులు, బాలింతలు పాల్గొన్నారు.
తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా
తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా
Komidala Mahender reddy
తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని చిట్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం ఐసీడీఎస్ సీడీపీఓ లావణ్య ఆధ్వర్యంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, అవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, కనీసం రెండేళ్ల వరకు కొనసాగించాలని బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 6 నెలల చిన్నారులకు అన్నప్రాశన చేయించడంతో పాటు, ఐసీడీఎస్ అందించిన అంగన్వాడీ విద్యార్థుల యూనిఫాంలను వైస్ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ షబానా, కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, 4వ వార్డు ప్రతినిధి కోనేటి ఎల్లయ్య, అంగన్వాడీ టీచర్లు దాడి అరుణ, జ్యోతి, అపర్ణ, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, కోనేటి మమత, వరమ్మలతో పాటు పలువురు తల్లులు, బాలింతలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి