Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 09:55 PM

తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా

తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా

తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా
05-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని చిట్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో బుధవారం ఐసీడీఎస్ సీడీపీఓ లావణ్య ఆధ్వర్యంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, అవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, కనీసం రెండేళ్ల వరకు కొనసాగించాలని బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా 6 నెలల చిన్నారులకు అన్నప్రాశన చేయించడంతో పాటు, ఐసీడీఎస్ అందించిన అంగన్‌వాడీ విద్యార్థుల యూనిఫాంలను వైస్ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ షబానా, కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, 4వ వార్డు ప్రతినిధి కోనేటి ఎల్లయ్య, అంగన్‌వాడీ టీచర్లు దాడి అరుణ, జ్యోతి, అపర్ణ, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, కోనేటి మమత, వరమ్మలతో పాటు పలువురు తల్లులు, బాలింతలు పాల్గొన్నారు.

Sthanikam

తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా

Article Image

తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని చిట్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో బుధవారం ఐసీడీఎస్ సీడీపీఓ లావణ్య ఆధ్వర్యంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, అవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, కనీసం రెండేళ్ల వరకు కొనసాగించాలని బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా 6 నెలల చిన్నారులకు అన్నప్రాశన చేయించడంతో పాటు, ఐసీడీఎస్ అందించిన అంగన్‌వాడీ విద్యార్థుల యూనిఫాంలను వైస్ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ షబానా, కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, 4వ వార్డు ప్రతినిధి కోనేటి ఎల్లయ్య, అంగన్‌వాడీ టీచర్లు దాడి అరుణ, జ్యోతి, అపర్ణ, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, కోనేటి మమత, వరమ్మలతో పాటు పలువురు తల్లులు, బాలింతలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News