అధ్యక్షుడిగా బండారు రమేష్, కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు ఎంపిక
ది సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీని బుధవారం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పదవీకాలానికి నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బండారు రమేష్, కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలిగా మా శెట్టి మంగమ్మ, కోశాధికారిగా తాటికొండ వెంకన్న ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య సమాజంలోని పేద కుటుంబాలకు మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ ద్వారా ఉచిత సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బెలిదే శ్రీనాథ్, నూనే పాండయ్య, నరేంద్రుని నవీన్, గజ్జి రమేష్, మిర్యాల సంపత్, వీర్లపాటి కేశవులు, గార్లపాటి జితేందర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి