బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం
అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసి ఓ మహిళకు ప్రాణాధారంగా నిలిచిన సూర్యాపేట ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యంను పలువురు అభినందించారు.
సూర్యాపేట ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ టెక్నీషియన్ దొనకొండ సైదులు పెద్దమ్మ లక్ష్మమ్మ తీవ్ర రక్తహీనతతో చికిత్స పొందుతూ ఉండగా, ఆమెకు అత్యవసరంగా బీ–పాజిటివ్ (B+) రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న వెంటనే అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం స్పందించి ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆలేటి మాణిక్యం చేసిన సేవను అసోసియేషన్ సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి