Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 10:04 PM

మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం
05-08-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చిన్నకొండూర్​లో బాధిత కుటుంబానికి రూ.10 వేల సాయం అందించిన సీఐటీయూ

కార్మికులకు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: మేకల శ్రీశైలం, గరిశే నరసింహ

అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు చెక్క పావయ్య కుటుంబాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) నాయకులు పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామానికి చెందిన పావయ్య కుటుంబ సభ్యులకు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.​ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మేకల శ్రీశైలం ముదిరాజ్, కార్యదర్శి గరిశే నరసింహ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తమ సంఘం పనిచేస్తోందని తెలిపారు. కష్టకాలంలో ఉన్న కార్మిక కుటుంబాలకు తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, పావయ్య కుటుంబానికి సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చెక్క శ్రీను, చెక్క యాదయ్య, చీమలకొండల శ్రీరాములు, బక్కి శ్రీనివాస్, పగడాల భిక్షం, ఎర్రోళ్ల స్వామి, నెల్ల సాయిలు, చెక్క భిక్షపతి, చెక్క రామచంద్రం, చీమలకొండల కృష్ణ, ఎండి అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం

Article Image

చిన్నకొండూర్​లో బాధిత కుటుంబానికి రూ.10 వేల సాయం అందించిన సీఐటీయూ

కార్మికులకు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: మేకల శ్రీశైలం, గరిశే నరసింహ

అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు చెక్క పావయ్య కుటుంబాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) నాయకులు పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామానికి చెందిన పావయ్య కుటుంబ సభ్యులకు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.​ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మేకల శ్రీశైలం ముదిరాజ్, కార్యదర్శి గరిశే నరసింహ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తమ సంఘం పనిచేస్తోందని తెలిపారు. కష్టకాలంలో ఉన్న కార్మిక కుటుంబాలకు తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, పావయ్య కుటుంబానికి సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చెక్క శ్రీను, చెక్క యాదయ్య, చీమలకొండల శ్రీరాములు, బక్కి శ్రీనివాస్, పగడాల భిక్షం, ఎర్రోళ్ల స్వామి, నెల్ల సాయిలు, చెక్క భిక్షపతి, చెక్క రామచంద్రం, చీమలకొండల కృష్ణ, ఎండి అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News