చిన్నకొండూర్లో బాధిత కుటుంబానికి రూ.10 వేల సాయం అందించిన సీఐటీయూ
కార్మికులకు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: మేకల శ్రీశైలం, గరిశే నరసింహ
అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు చెక్క పావయ్య కుటుంబాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) నాయకులు పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామానికి చెందిన పావయ్య కుటుంబ సభ్యులకు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మేకల శ్రీశైలం ముదిరాజ్, కార్యదర్శి గరిశే నరసింహ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తమ సంఘం పనిచేస్తోందని తెలిపారు. కష్టకాలంలో ఉన్న కార్మిక కుటుంబాలకు తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, పావయ్య కుటుంబానికి సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చెక్క శ్రీను, చెక్క యాదయ్య, చీమలకొండల శ్రీరాములు, బక్కి శ్రీనివాస్, పగడాల భిక్షం, ఎర్రోళ్ల స్వామి, నెల్ల సాయిలు, చెక్క భిక్షపతి, చెక్క రామచంద్రం, చీమలకొండల కృష్ణ, ఎండి అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి