Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 09:21 PM

మాఘ అమావాస్య సందర్భంగా భక్తులకు సురక్షిత రాకపోకల కోసం నిర్మించిన మెట్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే

మాఘ అమావాస్య సందర్భంగా భక్తులకు సురక్షిత రాకపోకల కోసం నిర్మించిన మెట్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే

మాఘ అమావాస్య సందర్భంగా భక్తులకు సురక్షిత రాకపోకల కోసం నిర్మించిన మెట్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే
05-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం బోరంచ గ్రామంలోని ప్రముఖ శ్రీ సంగమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన మెట్ల నిర్మాణ పనులను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. మాఘ అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు నదీ తీరానికి, బోటింగ్ ప్లాట్‌ఫారమ్ వరకు సురక్షితంగా చేరుకునేందుకు నిర్మించిన మెట్ల పనులు పూర్తికావడంతో వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. శ్రీ సంగమేశ్వర ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రమని, ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారని పేర్కొంటూ, వారికి మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామ వార్డు మెంబర్లు,మాజీ సర్పంచ్ బ్రహ్మానందరెడ్డి, గ్రామ సర్పంచ్ రమేష్ చౌహన్, బీరప్ప, కొంగరి శ్రీకాంత్ రెడ్డి, నవీన్ రెడ్డి, అఖిలేష్ రెడ్డి, మల్లప్ప, బాబన్న, బక్కుల్, దత్తు, నర్సింలు, రాఘవులు, సామ్సన్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

మాఘ అమావాస్య సందర్భంగా భక్తులకు సురక్షిత రాకపోకల కోసం నిర్మించిన మెట్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం బోరంచ గ్రామంలోని ప్రముఖ శ్రీ సంగమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన మెట్ల నిర్మాణ పనులను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. మాఘ అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు నదీ తీరానికి, బోటింగ్ ప్లాట్‌ఫారమ్ వరకు సురక్షితంగా చేరుకునేందుకు నిర్మించిన మెట్ల పనులు పూర్తికావడంతో వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. శ్రీ సంగమేశ్వర ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రమని, ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారని పేర్కొంటూ, వారికి మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామ వార్డు మెంబర్లు,మాజీ సర్పంచ్ బ్రహ్మానందరెడ్డి, గ్రామ సర్పంచ్ రమేష్ చౌహన్, బీరప్ప, కొంగరి శ్రీకాంత్ రెడ్డి, నవీన్ రెడ్డి, అఖిలేష్ రెడ్డి, మల్లప్ప, బాబన్న, బక్కుల్, దత్తు, నర్సింలు, రాఘవులు, సామ్సన్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News