అంకిరెడ్డిగూడెంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు, అన్నప్రాశన
పుట్టిన ప్రతి బిడ్డకూ తల్లిపాలే శ్రీరామరక్షణ అని, పసిపాపల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు అమృతంలా ఉపయోగపడతాయని అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అన్నారు. బుధవారం చౌటుప్పల్ మండలం, అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ (1, 2) కేంద్రాల ఆధ్వర్యంలో 'తల్లిపాల వారోత్సవాలు', 'ఆరోగ్య లక్ష్మి' కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలోని గర్భిణులు, బాలింతలు పోషకాహార లోపం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లల బరువు, శారీరక ఎదుగుదల వివరాలను అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన, తల్లి-బిడ్డల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు.
గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యకరమైన అలవాట్లు, పోషకాహారంపై చక్కటి కౌన్సిలింగ్, అవగాహన కల్పిస్తున్న అంగన్వాడీ టీచర్లు నల్ల జయప్రద, సప్పిడి కల్పనలను సర్పంచ్ ఈ సందర్భంగా అభినందించారు. గ్రామంలో పుట్టబోయే ప్రతీ బిడ్డ ఆరోగ్యం, భవిష్యత్తు నిర్మాణంలో అంగన్వాడీ సిబ్బంది బాధ్యత ఎంతో కీలకమైనదని స్పష్టం చేశారు. అనంతరం కేంద్రంలో చిన్నారులకు ఘనంగా అన్నప్రాశన జరిపించారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు పెండెం లక్ష్మి, ఉపాధ్యాయులు లక్ష్మణాచారి, జి పద్మ ఎం పీ హెచ్ ఏ(ఎఫ్), అంగన్వాడి టీచర్స్, ఆశ వర్కర్స్ బొడిగె అమృత, బొల్లు అండాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి