జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు ప్రత్యేక ప్రణాళిక
ఐజేయూ జాయింట్ సెక్రటరీ సుమన్
అందోల్ స్థానికం ప్రతినిధి :
జర్నలిస్టుల సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తానని సంగారెడ్డి జిల్లా జర్నలిస్టు యూనియన్ ఐజేయు జాయింట్ సెక్రటరీ సుమన్ తెలిపారు.ఇటీవల సదాశివపేట పట్టణంలో జరిగిన సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు.ముఖ్యంగా జిల్లాలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు సాధించే దిశగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించామని ఆయన పేర్కొన్నారు.ఇందుకోసం త్వరలోనే పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.అలాగే జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు త్వరలోనే వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు.తనకు జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించిన యూనియన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, తనకు ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి