గురువాయుగుండం గ్రామంలో ఇంటింటికి మొక్కల పంపిణీ
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని గురువాయుగుండం గ్రామ సర్పంచ్ బానోత్ బిక్షం పిలుపునిచ్చారు. బుధవారం గురువాయుగుండం గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక మొక్క అందజేస్తూ, వాటిని నాటి సంరక్షించి గ్రామాన్ని పచ్చదనంతో నింపాలని సర్పంచ్ బానోత్ బిక్షం కోరారు. గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలంతా మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బానోత్ సతీష్, దుర్గారావు, పద్మ, నాగిరెడ్డి ఉమా, లీల, శారద, రమాదేవి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి