ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ప్రిన్సిపల్ బి. వీరభద్రరావు
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ బి. వీరభద్రరావు, లైబ్రరీ ఇన్చార్జి పి. స్రవంతి, అధ్యాపకుడు విజయ్కుమార్ విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బి. వీరభద్రరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నోట్బుక్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై విద్యా వ్యయ భారం తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అందించిన నోట్బుక్స్ను సక్రమంగా వినియోగించి విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి