Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అవగాహన! కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 10:38 PM

టీటీడీ భూమిపై ఆక్రమణల ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

టీటీడీ భూమిపై ఆక్రమణల ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

టీటీడీ భూమిపై ఆక్రమణల ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
July 30, 2026 08:26 PM 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 649లో ఉన్న 1 ఎకరం 1 గుంట భూమి సుమారు 26 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కేటాయించబడిందని స్థానికులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.ప్రజలకు, భక్తులకు ఉపయోగపడాల్సిన టీటీడీ భూమిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు వెంటనే భూమిని పరిశీలించి ఆక్రమణలు నిజమైతే తొలగించి టీటీడీ ఆస్తిని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News