PRINT TIME: July 30, 2026 10:38 PM
టీటీడీ భూమిపై ఆక్రమణల ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
టీటీడీ భూమిపై ఆక్రమణల ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
July 30, 2026 08:26 PM
129 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 649లో ఉన్న 1 ఎకరం 1 గుంట భూమి సుమారు 26 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కేటాయించబడిందని స్థానికులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.ప్రజలకు, భక్తులకు ఉపయోగపడాల్సిన టీటీడీ భూమిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు వెంటనే భూమిని పరిశీలించి ఆక్రమణలు నిజమైతే తొలగించి టీటీడీ ఆస్తిని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి