PRINT TIME: July 30, 2026 10:26 PM
ప్రభుత్వ వైద్యంపై ‘రాజ్గోపాల్రెడ్డి’ సమీక్ష: ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి!
ప్రభుత్వ వైద్యంపై ‘రాజ్గోపాల్రెడ్డి’ సమీక్ష: ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి!
July 30, 2026 08:27 PM
78 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
నియోజకవర్గంలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, సాంకేతిక పరికరాల అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడులో నల్గొండ, యాదాద్రి జిల్లాల వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని, పేదలకు ఉచిత వైద్యం అందాలన్నారు. చౌటుప్పల్లో ట్రామా కేర్ సెంటర్, 100 పడకల ఆసుపత్రి వేగవంతానికి చర్యలు తీసుకుంటామని, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, చండూరు ఆసుపత్రుల విస్తరణకు నివేదికలు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాల డీఎంహెచ్ఓలు, డీసీహెచ్ఓలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి