ముగ్గురు బాల కార్మికుల గుర్తింపు యజమానులపై కేసు నమోదు
ముగ్గురు బాల కార్మికుల గుర్తింపు యజమానులపై కేసు నమోదు
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీసు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ తనిఖీల్లో ముగ్గురు బాల కార్మికులకు విముక్తి లభించింది. ఏహెచ్టీయూ లేబర్ డిపార్ట్మెంట్, డీసీపీయూ, అశ్రిత' స్వచ్ఛంద సంస్థల సంయుక్త బృందం చేపట్టిన ఈ తనిఖీల్లో నల్గొండలోని ఒక స్క్రాప్ షాప్లో పనిచేస్తున్న ఒక బాలుడిని, అమ్మనబోలు క్రాస్ రోడ్స్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేస్తున్న ఇద్దరు బీహార్కు చెందిన బాలురను గుర్తించారు.బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు గానూ స్క్రాప్ షాప్ యజమాని అంతం కార్తీక్ రెడ్డి, సూపర్వైజర్ యాట భాను ప్రకాష్లతో పాటు, భవన నిర్మాణ మేస్త్రీ షకల్దేవ్లపై నార్కట్పల్లి ఎస్ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, బాల కార్మికుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని నార్కట్పల్లి ఎస్సై విష్ణుమూర్తి ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి