PRINT TIME: July 17, 2026 07:51 PM
గ్రామ చరిత్రలో కొత్త అధ్యాయం.. నీట్లో తొలి అర్హత సాధించిన గాజులుపాడ్ విద్యార్థి భారత్
గ్రామ చరిత్రలో కొత్త అధ్యాయం.. నీట్లో తొలి అర్హత సాధించిన గాజులుపాడ్ విద్యార్థి భారత్
July 17, 2026 06:25 PM
72 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం గాజులుపాడ్ గ్రామానికి చెందిన భారత్ నీట్ (NEET) పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 24,408 సాధించి గ్రామ చరిత్రలో తొలి నీట్ అర్హత సాధించిన విద్యార్థిగా నిలిచాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బీరదర్ మారుతీరావు, సురేఖ భాయ్ దంపతుల కుమారుడైన భారత్ తన కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని అందుకుని గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు భారత్ను అభినందిస్తూ, భవిష్యత్తులో వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి