Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాకాల వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కమిషనర్ ప్రశాంతి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 05:40 PM

పదేళ్ల సమస్యకు సొంత ఖర్చుతో చెక్.. వెలిమినేడులో వార్డు సభ్యుడి చొరవ

పదేళ్ల సమస్యకు సొంత ఖర్చుతో చెక్.. వెలిమినేడులో వార్డు సభ్యుడి చొరవ

పదేళ్ల సమస్యకు సొంత ఖర్చుతో చెక్.. వెలిమినేడులో వార్డు సభ్యుడి చొరవ
July 17, 2026 04:31 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం, వెలిమినేడు:

గ్రామంలోని 9వ వార్డులో గత పదేళ్లుగా అండర్ డ్రైనేజ్ మ్యాన్‌హోల్స్ (మ్యానువల్స్) తెరవకపోవడంతో తీవ్ర పారిశుద్ధ్య సమస్య నెలకొంది. మురుగునీటి నిల్వలు, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు.

ఈ పరిస్థితిని గుర్తించిన 9వ వార్డు సభ్యుడు మహంకాళి లింగస్వామి తన సొంత ఖర్చులతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి, మూసుకుపోయిన మ్యాన్‌హోల్స్‌ను తెరిపించి సమస్యను పరిష్కరించారు. దీంతో వార్డులో మురుగునీటి ప్రవాహం సక్రమంగా సాగడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.దశాబ్దకాలంగా పేరుకుపోయిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వార్డు సభ్యుడు స్వయంగా ముందుకు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. స్థానికులు ఆయన సేవాభావాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గోలి నరేష్, వేషాల శంకరయ్య, గుండ్లపల్లి మధు, కంచుకోముల మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

"ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పదేళ్ల నిర్లక్ష్యానికి ప్రజాప్రతినిధి చొరవతో ముగింపు" అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News