పదేళ్ల సమస్యకు సొంత ఖర్చుతో చెక్.. వెలిమినేడులో వార్డు సభ్యుడి చొరవ
పదేళ్ల సమస్యకు సొంత ఖర్చుతో చెక్.. వెలిమినేడులో వార్డు సభ్యుడి చొరవ
Komidala Mahender reddy
చిట్యాల మండలం, వెలిమినేడు:
గ్రామంలోని 9వ వార్డులో గత పదేళ్లుగా అండర్ డ్రైనేజ్ మ్యాన్హోల్స్ (మ్యానువల్స్) తెరవకపోవడంతో తీవ్ర పారిశుద్ధ్య సమస్య నెలకొంది. మురుగునీటి నిల్వలు, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు.
ఈ పరిస్థితిని గుర్తించిన 9వ వార్డు సభ్యుడు మహంకాళి లింగస్వామి తన సొంత ఖర్చులతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి, మూసుకుపోయిన మ్యాన్హోల్స్ను తెరిపించి సమస్యను పరిష్కరించారు. దీంతో వార్డులో మురుగునీటి ప్రవాహం సక్రమంగా సాగడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.దశాబ్దకాలంగా పేరుకుపోయిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వార్డు సభ్యుడు స్వయంగా ముందుకు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. స్థానికులు ఆయన సేవాభావాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గోలి నరేష్, వేషాల శంకరయ్య, గుండ్లపల్లి మధు, కంచుకోముల మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
"ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పదేళ్ల నిర్లక్ష్యానికి ప్రజాప్రతినిధి చొరవతో ముగింపు" అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి