Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

ఇంట్లో చెప్పకుండా వెళ్లాడు.. తిరిగి రాలేదు! ​

ఇంట్లో చెప్పకుండా వెళ్లాడు.. తిరిగి రాలేదు! ​

ఇంట్లో చెప్పకుండా వెళ్లాడు.. తిరిగి రాలేదు! ​
10-07-2026 459 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో సైమన్ కంపెనీ ఉద్యోగి జగదీష్ అదృశ్యం

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యమైన సంఘటన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల గ్రామానికి చెందిన కారింగుల జగదీష్ (34) (తండ్రి నరసింహారావు) ప్రస్తుతం చౌటుప్పల్‌లోని కాటమయ్య కాలనీలో నివాసముంటున్నాడు. అతను స్థానిక సైమన్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.​ఈ క్రమంలో గురువారం (తేదీ 09-07-2026) సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో జగదీష్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. రాత్రి అయినా అతను తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య కారింగుల మౌనిక చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ పేర్కొన్నారు.

Sthanikam

ఇంట్లో చెప్పకుండా వెళ్లాడు.. తిరిగి రాలేదు! ​

Article Image

చౌటుప్పల్‌లో సైమన్ కంపెనీ ఉద్యోగి జగదీష్ అదృశ్యం

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యమైన సంఘటన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల గ్రామానికి చెందిన కారింగుల జగదీష్ (34) (తండ్రి నరసింహారావు) ప్రస్తుతం చౌటుప్పల్‌లోని కాటమయ్య కాలనీలో నివాసముంటున్నాడు. అతను స్థానిక సైమన్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.​ఈ క్రమంలో గురువారం (తేదీ 09-07-2026) సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో జగదీష్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. రాత్రి అయినా అతను తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య కారింగుల మౌనిక చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News