ఇంట్లో చెప్పకుండా వెళ్లాడు.. తిరిగి రాలేదు!
ఇంట్లో చెప్పకుండా వెళ్లాడు.. తిరిగి రాలేదు!
K.RAVI
చౌటుప్పల్లో సైమన్ కంపెనీ ఉద్యోగి జగదీష్ అదృశ్యం
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యమైన సంఘటన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల గ్రామానికి చెందిన కారింగుల జగదీష్ (34) (తండ్రి నరసింహారావు) ప్రస్తుతం చౌటుప్పల్లోని కాటమయ్య కాలనీలో నివాసముంటున్నాడు. అతను స్థానిక సైమన్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.ఈ క్రమంలో గురువారం (తేదీ 09-07-2026) సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో జగదీష్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. రాత్రి అయినా అతను తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య కారింగుల మౌనిక చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి