ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గంగుల వెంకట్ రాజిరెడ్డి.
ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గంగుల వెంకట్ రాజిరెడ్డి.
Editor Desk
రామన్నపేట,
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గంగుల వెంకట్ రాజిరెడ్డి అన్నారు. రామన్నపేట మండలంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై శనివారం ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రతి అర్హుడైన ఓటరు హక్కును పరిరక్షించేందుకేనని అన్నారు. మండలంలోని ప్రతి కుటుంబం తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు ఉన్నా ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ఓటర్ల నమోదులో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని గంగుల వెంకట్ రాజిరెడ్డి కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి