Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:26 AM

ఆదర్శ పాఠశాలలో డైనింగ్ హాల్, సీసీ రోడ్డు నిర్మించాలి ​– సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా

ఆదర్శ పాఠశాలలో డైనింగ్ హాల్, సీసీ రోడ్డు నిర్మించాలి ​– సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా

ఆదర్శ పాఠశాలలో డైనింగ్ హాల్, సీసీ రోడ్డు నిర్మించాలి ​– సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా
09-07-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)ను గురువారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి సరైన భవనం లేక రేకుల షెడ్డులోనే వండుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వర్షాకాలంలో వంటకు, విద్యార్థులు కూర్చొని తినడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇక్కడ వంటగదితో పాటు డైనింగ్ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే మోడల్ స్కూల్‌కు వెళ్లే దారి గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే అక్కడ సీసీ రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, బండారు నరసింహ, దండా అరుణ్ కుమార్, ఆకుల ధర్మయ్య, తోర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎం.డి. ఖయ్యూం, తోర్పునూరి వెంకటేష్, తోర్పునూరి సుమలత, గుణముని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదర్శ పాఠశాలలో డైనింగ్ హాల్, సీసీ రోడ్డు నిర్మించాలి ​– సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)ను గురువారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి సరైన భవనం లేక రేకుల షెడ్డులోనే వండుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వర్షాకాలంలో వంటకు, విద్యార్థులు కూర్చొని తినడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇక్కడ వంటగదితో పాటు డైనింగ్ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే మోడల్ స్కూల్‌కు వెళ్లే దారి గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే అక్కడ సీసీ రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, బండారు నరసింహ, దండా అరుణ్ కుమార్, ఆకుల ధర్మయ్య, తోర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎం.డి. ఖయ్యూం, తోర్పునూరి వెంకటేష్, తోర్పునూరి సుమలత, గుణముని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News