ఆదర్శ పాఠశాలలో డైనింగ్ హాల్, సీసీ రోడ్డు నిర్మించాలి – సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా
ఆదర్శ పాఠశాలలో డైనింగ్ హాల్, సీసీ రోడ్డు నిర్మించాలి – సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)ను గురువారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి సరైన భవనం లేక రేకుల షెడ్డులోనే వండుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వర్షాకాలంలో వంటకు, విద్యార్థులు కూర్చొని తినడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇక్కడ వంటగదితో పాటు డైనింగ్ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే మోడల్ స్కూల్కు వెళ్లే దారి గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే అక్కడ సీసీ రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, బండారు నరసింహ, దండా అరుణ్ కుమార్, ఆకుల ధర్మయ్య, తోర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎం.డి. ఖయ్యూం, తోర్పునూరి వెంకటేష్, తోర్పునూరి సుమలత, గుణముని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి