ఏడు ఎకరాల వరకు రైతుబంధు అమలు.. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం
ఏడు ఎకరాల వరకు రైతుబంధు అమలు.. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం
Komidala Mahender reddy
వెలిమినేడు, జూలై 9: రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఎకరాల వరకు రైతుబంధు ఆర్థిక సాయాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెలిమినేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగు కాలంలో ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఉపయోగపడేలా రైతుబంధు సాయాన్ని ఏడు ఎకరాల వరకు అమలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సుర్కంటి సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ–పాపయ్య, ఉపసర్పంచ్ అంతటి స్వప్న–సత్తయ్య గౌడ్, పాల సంఘం చైర్మన్ మారగోని యాదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అంతటి పారిజాత నరసింహ, వార్డు సభ్యులు మహంకాళి లింగస్వామి, చింతకింది వెంకటేశం, సంగీత సునీత, మాజీ ఎండోమెంట్ చైర్మన్ గోలి గణేష్, నాయకులు అంశాల సత్యనారాయణ, నాతి స్వామి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి