Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

వెంకటాపూర్‌లో పిడుగు విషాదం.. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

వెంకటాపూర్‌లో పిడుగు విషాదం.. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

వెంకటాపూర్‌లో పిడుగు విషాదం.. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
26-06-2026 606 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంలో పిడుగు పడడంతో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద పశువులను మేపుతున్న 25 ఏళ్ల చింతకుంట అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, అతనితో పాటు ఉన్న సిద్ధార్థ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సిద్ధార్థను వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్న వయసులోనే అనిల్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించగా, ఘటనపై సదాశివపేట ఇన్‌స్పెక్టర్ వెంకటేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

వెంకటాపూర్‌లో పిడుగు విషాదం.. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Article Image

సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంలో పిడుగు పడడంతో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద పశువులను మేపుతున్న 25 ఏళ్ల చింతకుంట అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, అతనితో పాటు ఉన్న సిద్ధార్థ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సిద్ధార్థను వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్న వయసులోనే అనిల్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించగా, ఘటనపై సదాశివపేట ఇన్‌స్పెక్టర్ వెంకటేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News