సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంలో పిడుగు పడడంతో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద పశువులను మేపుతున్న 25 ఏళ్ల చింతకుంట అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, అతనితో పాటు ఉన్న సిద్ధార్థ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సిద్ధార్థను వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్న వయసులోనే అనిల్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించగా, ఘటనపై సదాశివపేట ఇన్స్పెక్టర్ వెంకటేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PRINT TIME: August 31, 2026 07:35 AM
వెంకటాపూర్లో పిడుగు విషాదం.. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
వెంకటాపూర్లో పిడుగు విషాదం.. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
26-06-2026
606 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంలో పిడుగు పడడంతో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద పశువులను మేపుతున్న 25 ఏళ్ల చింతకుంట అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, అతనితో పాటు ఉన్న సిద్ధార్థ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సిద్ధార్థను వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్న వయసులోనే అనిల్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించగా, ఘటనపై సదాశివపేట ఇన్స్పెక్టర్ వెంకటేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి