PRINT TIME: June 26, 2026 09:09 PM
భక్తుల కోలాహలంతో వైభవంగా ముగిసిన బోరంచ మొహర్రం పీర్ల ఊరేగింపు
భక్తుల కోలాహలంతో వైభవంగా ముగిసిన బోరంచ మొహర్రం పీర్ల ఊరేగింపు
June 26, 2026 07:48 PM
70 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో గత నాలుగు రోజులుగా కొనసాగిన మొహర్రం వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. దుందేకుళ మసీదు బీపాత్మ పీర్లు, సర్కార్ మసీదు పీర్ల ఊరేగింపులో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, యువత, చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొని ఆటపాటల మధ్య గ్రామ వీధుల్లో ఉత్సాహంగా తిరిగి అనంతరం గ్రామ మంజీర ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మసీదు నిర్వాహకులు మొహర్రం వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి