రామన్నపేట, : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని దర్గా వద్ద మొహరం వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. కొండ వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
దర్గా ప్రాంగణంలో మత పెద్దలు దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక దువాలు చేశారు. మొహరం సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ మత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కొండ వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ, మొహరం పండుగ మతసామరస్యానికి ప్రతీక అని, అన్ని వర్గాల ప్రజలు కలిసి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వేడుకలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి