PRINT TIME: June 26, 2026 10:06 PM
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. సుమన్ కల్యాణ్
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. సుమన్ కల్యాణ్
June 26, 2026 08:52 PM
24 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బలపడుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. సుమన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తుల ఆరోగ్యంతో పాటు కుటుంబాలను, సమాజాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత విద్య, క్రీడలు, నైతిక విలువల వైపు దృష్టి సారించాలని సూచించారు. మత్తు నిర్మూలనకు ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం
"మత్తుకు కాదు... జీవితానికి అవును" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి, మత్తు రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి