చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు శ్రీ మల్లికార్జున నగర్ కాలనీవాసుల తాగునీటి ఇబ్బందులను తొలగిస్తూ ప్రముఖ నాయకుడు బొబ్బల రాజశేఖర్ రెడ్డి సొంత నిధులతో బోరుబావిని వేయించారు. ఎన్నో రోజులుగా నీటి సమస్యతో సతమతమవుతున్న స్థానికుల అవసరాలను గుర్తించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
బోరుబావిలో సమృద్ధిగా నీరు పడటంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. తమ దాహార్తిని తీర్చడానికి తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో బోరు వేయించిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి సేవా నిరతిని కాలనీవాసులు కొనియాడారు. గంగమ్మ తల్లి ఏరులై పారిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజశేఖర్ రెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి