Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన డిప్యూటీ ఆర్‌ఎం లక్ష్మీ ధర్మకు మర్యాదపూర్వక సత్కారం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 11:34 PM

సొంత నిధులతో బోరు.. కాలనీవాసుల దాహార్తి తీర్చిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి

సొంత నిధులతో బోరు.. కాలనీవాసుల దాహార్తి తీర్చిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి

సొంత నిధులతో బోరు.. కాలనీవాసుల దాహార్తి తీర్చిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి
June 12, 2026 10:23 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు శ్రీ మల్లికార్జున నగర్ కాలనీవాసుల తాగునీటి ఇబ్బందులను తొలగిస్తూ ప్రముఖ నాయకుడు బొబ్బల రాజశేఖర్ రెడ్డి సొంత నిధులతో బోరుబావిని వేయించారు. ఎన్నో రోజులుగా నీటి సమస్యతో సతమతమవుతున్న స్థానికుల అవసరాలను గుర్తించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

​బోరుబావిలో సమృద్ధిగా నీరు పడటంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. తమ దాహార్తిని తీర్చడానికి తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో బోరు వేయించిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి సేవా నిరతిని కాలనీవాసులు కొనియాడారు. గంగమ్మ తల్లి ఏరులై పారిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజశేఖర్ రెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News