Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 10:33 AM

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్
June 12, 2026 08:57 AM 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* బాధితులకు 50 కిలోల బియ్యం పంపిణీ

* తోడుగా ఉంటామని భరోసా

ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతని చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామ 3వ వార్డు సభ్యులు దోర్నాల శ్రీనివాస్ అన్నారు. చిన్నకొండూర్ గ్రామానికి చెందిన డొప్ప క్రాంతి కుటుంబం ఇటీవల తీవ్ర ఇబ్బందుల్లో పడటంతో విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గురువారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.​ఆ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, తానున్నానంటూ కొండంత భరోసా కల్పించారు. అనంతరం వారి తక్షణ కుటుంబ అవసరాల నిమిత్తం తన సొంత ఖర్చులతో 50 కిలోల బియ్యాన్ని బాధితులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా స్పందించి అండగా నిలవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు తోడుగా ఉంటూ సేవ చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.ఈ మానవతా దృక్పథ కార్యక్రమాల్లో ఐవైసీ (IYC) మండల వైస్ ప్రెసిడెంట్ నెల్లే గణేష్, 1వ వార్డు సభ్యుడు బక్క భిక్షం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బక్క నరసింహ, డొప్ప భిక్షపతి, ఊదరి రమేష్, బక్క స్వామి, నత్తి వెంకటేష్, పాపగల మహేష్, నత్తి కిరణ్, డొప్ప కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News