ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్
K.RAVI
* బాధితులకు 50 కిలోల బియ్యం పంపిణీ
* తోడుగా ఉంటామని భరోసా
ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతని చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామ 3వ వార్డు సభ్యులు దోర్నాల శ్రీనివాస్ అన్నారు. చిన్నకొండూర్ గ్రామానికి చెందిన డొప్ప క్రాంతి కుటుంబం ఇటీవల తీవ్ర ఇబ్బందుల్లో పడటంతో విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గురువారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఆ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, తానున్నానంటూ కొండంత భరోసా కల్పించారు. అనంతరం వారి తక్షణ కుటుంబ అవసరాల నిమిత్తం తన సొంత ఖర్చులతో 50 కిలోల బియ్యాన్ని బాధితులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా స్పందించి అండగా నిలవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు తోడుగా ఉంటూ సేవ చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.ఈ మానవతా దృక్పథ కార్యక్రమాల్లో ఐవైసీ (IYC) మండల వైస్ ప్రెసిడెంట్ నెల్లే గణేష్, 1వ వార్డు సభ్యుడు బక్క భిక్షం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బక్క నరసింహ, డొప్ప భిక్షపతి, ఊదరి రమేష్, బక్క స్వామి, నత్తి వెంకటేష్, పాపగల మహేష్, నత్తి కిరణ్, డొప్ప కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి