Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:09 AM

సౌకర్యాలు శూన్యం.. వసూళ్లు ఘనం!

సౌకర్యాలు శూన్యం.. వసూళ్లు ఘనం!

సౌకర్యాలు శూన్యం.. వసూళ్లు ఘనం!
11-06-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో వినియోగదారుల అవస్థలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ నిబంధనల ఉల్లంఘనకు అడ్డాగా మారింది. నిత్యం వందలాది మంది వచ్చే ఈ బంక్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో నిత్యం ప్రయాణించే దాదాపు 250 మందికి పైగా మహిళలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంక్‌లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు.

​ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాలకు ఉచితంగా గాలి కొట్టాల్సి ఉండగా.. ఇక్కడి యాజమాన్యం ఉచిత పంపును పక్కనబెట్టి, ప్రైవేట్ వ్యక్తికి అద్దెకు ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి వాహనదారుల నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. నియమ నిబంధనలు గాలికొదిలేసిన ఈ బంక్ యాజమాన్యంపై యాదాద్రి భువనగిరి జిల్లా పౌర సరఫరాల అధికారి (CSO) తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం చౌటుప్పల్ అధ్యక్షులు పేరేపల్లి స్వామి గౌడ్, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

సౌకర్యాలు శూన్యం.. వసూళ్లు ఘనం!

Article Image

హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో వినియోగదారుల అవస్థలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ నిబంధనల ఉల్లంఘనకు అడ్డాగా మారింది. నిత్యం వందలాది మంది వచ్చే ఈ బంక్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో నిత్యం ప్రయాణించే దాదాపు 250 మందికి పైగా మహిళలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంక్‌లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు.

​ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాలకు ఉచితంగా గాలి కొట్టాల్సి ఉండగా.. ఇక్కడి యాజమాన్యం ఉచిత పంపును పక్కనబెట్టి, ప్రైవేట్ వ్యక్తికి అద్దెకు ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి వాహనదారుల నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. నియమ నిబంధనలు గాలికొదిలేసిన ఈ బంక్ యాజమాన్యంపై యాదాద్రి భువనగిరి జిల్లా పౌర సరఫరాల అధికారి (CSO) తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం చౌటుప్పల్ అధ్యక్షులు పేరేపల్లి స్వామి గౌడ్, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News